Hindupuram: నామినేషన్ కు ముహూర్తం ఖరారు చేసుకున్న బాలకృష్ణ!

  • హిందూపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా బాలయ్య
  • 22న నామినేషన్ వేయాలని నిర్ణయం
  • భారీ ర్యాలీకి ఏర్పాట్లు

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న నందమూరి బాలకృష్ణ, తన నామినేషన్ దాఖలుకు ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ నెల 22న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ విషయాన్ని పీఆర్వో వంశీ కాక, తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. "హిందూపురంలో బాలకృష్ణ 22వ తేదీన నామినేషన్ వేస్తారు" అని పేర్కొన్నారు. కాగా, బాలకృష్ణ నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ జరిపేందుకు పట్టణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.




More Telugu News