Piyush Goyal: మోసగాడని తెలియడంతో... తన క్లాస్ మేట్ ను జైల్లో పెట్టించిన రైల్వే మంత్రి పీయుష్ గోయల్!

  • పూర్వ విద్యార్థుల సమావేశంలో పరిచయం
  • పీయుష్ తో ఫోటోలు దిగి దందాలు
  • రైల్వే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని డబ్బు వసూలు
  • విషయం తెలుసుకుని కేసు పెట్టించిన రైల్వే మంత్రి

చిన్నప్పటి తన క్లాస్ మేట్ మోసగాడని, తన పేరును వాడుకుంటూ మోసం చేశాడని తెలుసుకున్న రైల్వే మంత్రి పీయుష్ గోయల్, అతనిపై కేసు పెట్టాలని ఆదేశించారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. వివరాల్లోకి వెళితే, నగరానికి చెందిన మాతుంగ ప్రాంత వ్యక్తి, జ్యోతి కుమార్ అగర్వాల్ (50) పీయుష్ గోయల్ స్కూల్ మేట్. చిన్నప్పుడు వారిద్దరూ కలిసి చదువుకున్నారు.

 గత సంవత్సరం సెప్టెంబర్ లో తన స్కూల్ పూర్వ విద్యార్థుల సమావేశం జరుగగా, పీయుష్ గోయల్ వెళ్లిన వేళ, జ్యోతి కుమార్ మరోసారి పరిచయం చేసుకుని, ఫోటోలు దిగాడు. వాటిని చూపిస్తూ తన దందాలను ప్రారంభించాడు. మనీష్ చగన్ లాల్ అనే వ్యక్తికి వాటిని చూపించి, పీయుష్ తో మాట్లాడి, రైల్వే కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మబలికాడు.

పీయుష్ కు దీపావళి కానుకను పంపుదామని చెప్పి రూ. 1.50 లక్షలు తీసుకున్నాడు. ఆపై కాంట్రాక్ట్ మాటెత్తకపోవడంతో, తనకున్న పరిచయాలతో షీయుష్ ను సంప్రదించిన మనీష్ అసలు విషయాన్ని ఆయనకు వివరించాడు. దీంతో జ్యోతికుమార్ మోసగాడని, కేసు పెట్టి అరెస్ట్ చేయాలని పీయుష్ స్వయంగా ముంబై పోలీసులను ఆదేశించారు. దీంతో కదిలిన పోలీసులు, జ్యోతికుమార్ అగర్వాల్ పై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

More Telugu News