Telangana: కేసీఆర్ కుమార్తె కవితపై పోటీకి వెయ్యిమంది రైతులు రెడీ!

  • పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కోసం డిమాండ్
  • రసవత్తరంగా మారనున్న నిజామాబాద్ ఎన్నిక
  • రైతు సంఘాల నిర్ణయం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితపై పోటీ చేసేందుకు ఏకంగా వెయ్యిమంది సిద్ధమవుతున్నారు. కవితపై పోటీకి దిగబోతున్నవారందరూ రైతులు కావడం గమనార్హం. కవితపై తమ నిరసనను తెలిపేందుకు ఈ సరికొత్త పంథాను ఎంచుకున్నారు.

పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కోసం డిమాండ్ చేస్తున్న వీరంతా కవితపై మూకుమ్మడిగా పోటీకి దిగాలని రైతు సంఘాలు తీర్మానించాయి. కనీసం 500 నుంచి వెయ్యి వరకు నామినేషన్లు దాఖలు చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎన్నిక రసవత్తరంగా మారనుంది.

More Telugu News