Ravi Ramanatham Babu: టీడీపీలో చేరనున్న పర్చూరు వైసీపీ నేత!

  • భగ్గుమన్న అసమ్మతి సెగలు
  • టికెట్ ఆశించి భంగపడ్డ రామనాథం బాబు
  • పార్టీని వీడాలని నిర్ణయం

వైసీపీ అభ్యర్థుల జాబితాను వెల్లడించడంతో అసమ్మతి సెగలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. టికెట్ దక్కని నేతలంతా అసంతృప్తితో తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరు సమన్వయకర్తగా ఉన్న రావి రామనాథంబాబు తన నియోజకవర్గ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ టికెట్‌ను వైసీపీ అధినేత జగన్.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో టీడీపీ కండువా కప్పుకోనున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది.

More Telugu News