vice-president: నా భాగస్వామ్యం లేకుండా తొలిసారి జరుగుతున్న ఎన్నికలివి: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • యూఎన్ఓ-శాంతి విశ్వవిద్యాలయం నుంచి వెంకయ్యనాయుడికి డాక్టరేట్
  • హైదరాబాద్ లో ఘన సన్మానం
  • ఇన్నేళ్లలో అనేక పదవులు అధిష్టించాను

నలభై రెండేళ్ల తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలిసారిగా తన భాగస్వామ్యం లేకుండా ఎన్నికలు జరగబోతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఐక్యరాజ్యసమితి-శాంతి విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన సందర్భంగా ఆయన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ లో ఓ కార్యక్రమం నిర్వహించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఇన్నేళ్లలో అనేక పదవులు అధిష్టించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే, తనకు ఉపరాష్ట్రపతి పదవి వచ్చినప్పుడు మిశ్రమ స్పందన వచ్చిందని, ఈ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు తనలో కూడా అదే స్పందన కలుగుతుందని చెప్పారు.

More Telugu News