Cricket: ఐసీసీ ర్యాంకుల్లో 'టాప్' లేపిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

  • మొదటిస్థానంలో టీమిండియా కెప్టెన్
  • రెండోస్థానంలో వైస్ కెప్టెన్
  • బౌలర్లలో బుమ్రా నం.1

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నారు. బ్యాటింగ్ విభాగంలో  కోహ్లీ నం.1 స్థానంలో కొనసాగుతుండగా, రోహిత్ శర్మ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఐసీసీ ఆదివారం తాజా ర్యాంకింగ్స్ జాబితాలు విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగం టాప్-10లో వీరిద్దరు మినహా భారత్ నుంచి మరెవరూ స్థానం దక్కించుకోలేకపోయారు.

బౌలింగ్ ర్యాంకింగ్స్ చూస్తే యువ స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రాకు ఎదురులేకుండాపోయింది. బుమ్రా 774 పాయింట్లతో వన్డే బౌలర్ల జాబితాలో టాప్ ర్యాంక్ నిలబెట్టుకున్నాడు. భారత్ కు చెందిన యువస్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆరోస్థానంలో ఉండగా, లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ 8వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో బుమ్రా తర్వాత న్యూజిలాండ్ కు చెందిన ట్రెంట్ బౌల్ట్, ఆఫ్ఘన్ సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. రషీద్ ఖాన్ వన్డే ఆల్ రౌండర్ల విభాగంలో నం.1 పొజిషన్ లో ఉండడం విశేషం అని చెప్పాలి.

More Telugu News