mysura reddy: క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా: ఎంవీ మైసూరారెడ్డి

  • రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడతా
  • అవసరమైతే అన్ని పార్టీలనూ కలుపుకుని పోరాడతా
  • రాయలసీమ హక్కుల సాధనకు మహాసభ నిర్వహిస్తాం

క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి ప్రకటించారు. రాయలసీమ హక్కుల సాధనపై కడపలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మైసూరారెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడతానని, అవసరమైతే అన్ని పార్టీలనూ కలుపుకుని పోరాడతానని చెప్పారు. రాయలసీమ హక్కుల సాధన నిమిత్తం మహాసభ నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. రాయలసీమ సమస్యల పరిష్కారానికి మాజీ సీఎస్ అజయ్ కల్లం నేతృత్వంలో ఓ కమిటీ  ఏర్పాటు చేయనున్నట్టు మైసూరా రెడ్డి ప్రకటించారు.

More Telugu News