nirosha: రీ ఎంట్రీ ఇస్తోన్న సీనియర్ హీరోయిన్ నిరోషా

  • హీరోగా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సుధాకర్ 
  • అధికభాగం చిత్రీకరణ అమెరికాలో 
  • ఏప్రిల్ 26వ తేదీన విడుదల

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో కథానాయికగా నిరోషా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నిరోషా చేసినవి తక్కువ సినిమాలే అయినా, ఆమెకి వచ్చిన గుర్తింపు ఎక్కువ. తమిళ సినిమాల్లో వరుసగా ముఖ్యమైన పాత్రలను చేస్తూ వస్తోన్న ఆమె, తెలుగు సినిమాలకి మాత్రం చాలాకాలంగా దూరంగానే ఉంటూ వస్తోంది. అలాంటి నిరోషా తాజాగా 'నువ్వు తోపురా' సినిమాలో చేసింది.

ఈ సినిమాలో ఆమె పాత్ర వైవిధ్యభరితంగా .. పవర్ఫుల్ గా మలచబడిందని అంటున్నారు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన సుధాకర్ .. ఈ సినిమాలో హీరోగా చేశాడు. హరనాథ్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుధాకర్ జోడీగా నిత్యా శెట్టి నటించింది. కథాపరంగా ఈ సినిమా చిత్రీకరణ దాదాపు అమెరికాలోనే జరిగింది. అల్లు అరవింద్ .. బన్నీ వాసు కలిసి ఏప్రిల్ 26వ తేదీన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు.

More Telugu News