Vijayawada: రాజకీయ నేతలకు రక్షణ కరవైంది: వైసీపీ నేత మల్లాది

  • వైఎస్ వివేకా హత్యపై వైసీపీ నేతల నిరసన
  • రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన  
  • వివేకా హత్యపై థర్డ్ పార్టీతో విచారణ చేయించాలి

ఏపీలో పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారని, రాజకీయ నేతలకు రక్షణ కరవైందని వైసీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు. వైసీపీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ  సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. విజయవాడలో మీడియతో మల్లాది విష్ణు మాట్లాడుతూ, వివేకా హత్యపై థర్డ్ పార్టీతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వైసీపీని బలహీనపర్చాలని టీడీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

More Telugu News