Karnataka: కంటతడి పెట్టడంలో దేవెగౌడ కుటుంబాన్ని మించినవాళ్లు లేరు: బీజేపీ

  • ఇది కిచిడీ సర్కారు
  • ఏడుపుల్లో వాళ్లకే వాళ్లే సాటి
  • బీజేపీ కర్ణాటక ఎన్నికల ఇన్ చార్జ్ వ్యంగ్యం

కర్ణాటక బీజేపీ ఎన్నికల ఇన్ చార్జ్ ఆర్. అశోక్ మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబంపై విమర్శలు చేశారు. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయాల్లో కంటతడి పెట్టడంలో దేవెగౌడ కుటుంబాన్ని మించినవాళ్లు మరొకరు లేరని వ్యంగ్యం ప్రదర్శించారు.

మామూలుగానే ప్రతిదానికీ కంటతడి పెట్టే దేవెగౌడ ఎన్నికల సమయాల్లో మరింత ఎక్కువగా ఏడుస్తుంటారని అన్నారు. హాసన్ పట్టణంలో బుధవారం నాడు ఏడుపులు ముగిశాయని అనుకునేంతలోనే గురువారం నాడు మాండ్యలో ప్రత్యక్షమయ్యాయని ఎద్దేవా చేశారు. దేవెగౌడ సంగతి అలావుంటే, ఆయన తనయుడు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కుమారస్వామి ఇప్పటివరకు ఎన్నిసార్లు కంటతడి పెట్టాడో లెక్కేలేదని వ్యాఖ్యానించారు అశోక్. రాష్ట్రంలో ఇలాంటి కిచిడీ ప్రభుత్వంతో సమస్యలు తీరవని అందరూ గుర్తించాలని సూచించారు.

More Telugu News