samanta: షూటింగు పూర్తి చేసుకున్న 'ఓ బేబీ'

  • నందినీ రెడ్డి నుంచి 'ఓ బేబీ'
  • కొరియన్ మూవీకి రీమేక్ 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు

పెళ్లికి ముందు వరకూ గ్లామర్ ప్రధానమైన పాత్రలను ఎక్కువగా చేస్తూ వచ్చిన సమంత, పెళ్లి తరువాత నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే చేసిన 'యు టర్న్' ఆమెకి మంచి పేరును తీసుకొచ్చింది. నాయికా ప్రధానమైన పాత్రలను సమంత అద్భుతంగా చేయగలదని నమ్మకాన్ని కలిగించింది.

ఫలితంగా నందినీ రెడ్డి దర్శకత్వంలో 'ఓ బేబీ' సినిమా చేసే ఛాన్స్ ఆమెకి దక్కింది. ఈ సినిమాకి 'ఎంత సక్కగున్నావే' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి ఇది రీమేక్. ఈ సినిమాలో యువతిగాను .. వృద్ధురాలిగాను సమంత డిఫరెంట్ లుక్స్ తో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ .. సురేశ్ ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా తాజాగా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో సమంత మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.

More Telugu News