ys viveka: వైయస్ వివేకానందరెడ్డిని హత్య చేశారు.. పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదిక

  • రిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో పోస్ట్ మార్టం
  • పులివెందులలోని నివాసానికి భౌతికకాయం తరలింపు
  • భారీ ఎత్తున చేరుకుంటున్న అభిమానులు, కార్యకర్తలు

వైయస్ వివేకానందరెడ్డిది హత్య అని పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదికలో తేలినట్టు సమాచారం. కాసేపటి క్రితం వివేకా మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. రిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం పులివెందులలోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. వివేకా నివాసం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. మంచి వ్యక్తిత్వం కలిగిన ప్రజానేతను కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వివేకా మృతి దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేశారు. 

More Telugu News