India: ఆస్ట్రేలియా-భారత్ ఐదో వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలు!

  • ఫించ్, ఖవాజా ఓపెనింగ్
  • 4 ఓవర్లకు 28 పరుగులు
  • మ్యాచ్ గెలిచినవాళ్లకే సిరీస్ సొంతం

భారత్ ఆస్ట్రేలియాల మధ్య నేడు జరగనున్న నిర్ణయాత్మక ఐదో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో రెండు వన్డేలు గెలిచిన నేపథ్యంలో ఈ వన్డేలో విజయం సాధించేందుకు ఇరు జట్లు తీవ్రంగా పోరాడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు 4 ఓవర్లు ముగిసేనాటికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.  ఖవాజా 22, ఫించ్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

భారత జట్టు: 
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషబ్ పంత్, జాదవ్, విజయ్ శంకర్, జడేజా, భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్, షమీ, బుమ్రా
ఆస్ట్రేలియా జట్టు: 
ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆష్టన్ టర్నర్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్, జై రిచర్డ్‌సన్, ఆడం జంపా, నాథన్ లయన్, మార్కస్ స్టోనిస్ 

More Telugu News