India: తనను పట్టించుకోకుండా టీవీ సీరియల్స్ చూస్తోందని.. భార్యను రాడ్డుతో చితక్కొట్టిన భర్త!

  • మహారాష్ట్రలోని పూణేలో ఘటన
  • కుమారుడి విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం
  • హత్యచేయబోయాడని పోలీసులకు భార్య ఫిర్యాదు

చిన్నగొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. తనను పట్టించుకోకుండా భార్య టీవీ సీరియల్స్ చూడటంతో మనస్తాపానికి గురైన ఓ భర్త రెచ్చిపోయాడు. పక్కనే ఉన్న రాడ్డుతో ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించారు. మహారాష్ట్రలోని పూణేలో గత సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూణేలోని సాలిస్‌బరిలో వుండే ఆసిఫ్ సత్తార్ హోర్డింగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కుమారుడు లీకైన పాల ప్యాకెట్ తీసుకురావడంతో భార్య పిల్లాడిని కసురుకుంది. దీంతో సత్తార్ భార్యను మందలించాడు. ఈ నేపథ్యంలో భర్తపై అలిగిన ఆమె ఇంట్లోకి వెళ్లి పడుకుంది. పనికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చినప్పటికీ సత్తార్ ను పట్టించుకోకుండా పాకిస్థానీ సీరియల్స్ చూస్తూ పడుకుంది.

దీంతో సహనం కోల్పోయిన సత్తార్ పక్కనే ఉన్న ఓ రాడ్డును తీసుకొచ్చి ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. ఈ ఘటనలో భార్య కుడిచేతి వేలు విరిగిపోయింది. కాగా, తన భర్త తనను చంపేందుకు యత్నించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు.. భర్త సత్తార్ ను అరెస్ట్ చేశారు.

More Telugu News