YSRCP: వైసీపీలో చేరిన పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే

  • భారీగా జరుగుతున్న వలసలు
  • జగన్‌తో భేటీ అయిన బాబ్జి
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్

సార్వత్రిక ఎన్నికలు నెల రోజులు కూడా లేవు. పార్టీలు టికెట్ల కేటాయింపుల్లో బిజీబిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వలసలు కూడా భారీగా జరుగుతున్నాయి. నేడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి (బాబ్జీ) వైసీపీ కండువా కప్పుకున్నారు. లోటస్‌పాండ్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత జగన్‌తో భేటీ అయిన బాబ్జీ అనంతరం వైసీపీలో చేరారు. ఆయనకు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

More Telugu News