nikhil: వచ్చేనెల నుంచి సెట్స్ పైకి నిఖిల్ - నివేదల 'శ్వాస'

  • వైవిధ్యభరితమైన చిత్రంగా 'శ్వాస'
  • సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నిఖిల్ 
  • కథానాయికగా నివేదా థామస్  

నిఖిల్ తాజా చిత్రంగా 'అర్జున్ సురవరం' నిర్మితమైంది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా భారీస్థాయిలో విడుదలకానుంది. ఈ సినిమా ఇలా థియేటర్లకు రాగానే, అలా ఆయన తదుపరి ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. నిఖిల్ తదుపరి సినిమా 'శ్వాస' పేరుతో రూపొందనుంది. దర్శకుడిగా కిషన్ కట్టా పరిచయమవుతోన్న ఈ సినిమాలో, కథానాయికగా నివేదా థామస్ ను తీసుకున్నారు.

ఈ సినిమాలో నిఖిల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడని అంటున్నారు. పూర్తిగా ట్రావెల్ బేస్డ్ సినిమా ఇది. అందువలన ఇంతకుముందు తెరపై కనిపించని లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగు జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. రెడ్ స్కై ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై .. వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. తన కెరియర్లో వైవిధ్యభరితమైనదిగా ఈ సినిమా నిలిచిపోతుందనే నమ్మకంతో నిఖిల్ వున్నాడని అంటున్నారు.

More Telugu News