jagan: టీడీపీని బంగాళాఖాతంలో కలిపితేనే అది సాధ్యం: జగన్

  • ఈ ఎన్నికలు రెండు పార్టీల మధ్య జరుగుతున్నవి కాదు
  • నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న ఎన్నికలు
  • కాకినాడలో ఎన్నికల శంఖారావం పూరించిన జగన్

ఇప్పుడు జరగబోతున్నవి రెండు పార్టీల మధ్య జరిగే ఎన్నికలు కావని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఈ ఎన్నికలు ప్రజలకు, రాక్షసులకు మధ్య... నీతికి, అవినీతికి మధ్య... విశ్వసనీయతకు, అవకాశవాదానికి మధ్య... ప్రజాస్వామ్యానికి, అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు.

కాకినాడ శంఖారావం సభలో ఆయన ప్రసంగిస్తూ, ఈ రాజకీయ వ్యవస్థలో విలువలు నిలబడాలన్నా, విశ్వసనీయతకు అర్థం ఉండాలన్నా... అది టీడీపీని బంగాళాఖాతంలో కలిపితేనే జరుగుతుందని అన్నారు. ఎన్నికలు సాఫీగా జరగాలంటే ఒక్క జగన్ వల్లే సాధ్యం కాదని... మీ అందరి మద్దతు అవసరమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. 

More Telugu News