YSRCP: వైసీపీ కేంద్రపాలక మండలి సభ్యునిగా జూనియర్‌ ఎన్టీఆర్‌ మామ!

  • ఇటీవలే పార్టీలో చేరిన నార్నె శ్రీనివాసరావు
  • కీలక బాధ్యతలు అప్పగించిన జగన్‌
  • ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన పార్టీ వర్గాలు

ఇటీవలే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన టాలీవుడ్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ మామ నార్నె శ్రీనివాసరావును పార్టీ కేంద్రపాలక మండలి సభ్యునిగా నియమిస్తూ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నార్నె శ్రీనివాసరావు ఫిబ్రవరి 28వ తేదీన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వెంటనే ఆయనకు కీలక పదవి దక్కడం గమనార్హం.

More Telugu News