Mahesh Babu: భారీగా పెరిగిన 'మహర్షి' నిడివి .. కోతలు మొదలెట్టిన వంశీ పైడిపల్లి

  • ముగింపు దశలో 'మహర్షి'
  • అభిమానుల్లో ఆసక్తి 
  • మే 9వ తేదీన విడుదల

మహేశ్ బాబు అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'మహర్షి' సినిమాపైనే వుంది. ఈ సినిమా విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వాళ్లు ఆసక్తిని చూపుతున్నారు. ఇటు ఇండియాలోనూ .. అటు విదేశాల్లోను ఈ సినిమా షూటింగ్ జరిగింది. అవుట్ డోర్ లోను .. ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్ లోను చిత్రీకరణ చేస్తూ వచ్చారు.

ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం ఈ సినిమా నిడివి 4 గంటలు వచ్చిందట. దాంతో వంశీ పైడిపల్లి కోతలు మొదలుపెడితే .. 3 గంటల 20 నిమిషాలకి వచ్చిందట. ఈ నిడివిని ఆయన 3 గంటల లోపుకి తీసుకురావలసి వుంది. అయితే ఈ నిడివిని తగ్గించడం చాలా కష్టంగా ఉందనీ, తనకి చాలా ఇష్టమైన సన్నివేశాలను కొన్నింటిని త్యాగం చేయవలసి వస్తుందంటూ సన్నిహితులతో ఆయన చెబుతున్నాడట. 3 గంటలలోపు నిడివిలో ఏయే సన్నివేశాలను కుదించాలనే విషయంపై టీమ్ తర్జనభర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది. మే 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News