Cricket: లక్ష్యం దిశగా ఆసీస్!... ఖవాజా, హ్యాండ్స్ కోంబ్ హాఫ్ సెంచరీలు

  • 31 ఓవర్లలో 180/2
  • ఒత్తిడిలో టీమిండియా బౌలర్లు
  • భారత్ స్కోరు 358

మొహాలీ వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా లక్ష్యం దిశగా సాగుతోంది. 359 పరుగుల భారీలక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. అయితే ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్ కోంబ్ భారీ అర్ధసెంచరీలతో భారత్ ను బెంబేలెత్తించారు. 31 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 2 వికెట్లకు 180 పరుగులు కాగా, ఖవాజా 86, హ్యాండ్స్ కోంబ్ 80 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 19 ఓవర్లలో 179 పరుగులు చేయాలి. అంతకుముందు, మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది.

More Telugu News