Suryakantham: ‘సూర్యకాంతం’ సెట్స్ లో ‘ఖుషీ‘ పాట.. బాబాయ్ పాటకు స్టెప్పులేసిన నీహారిక!

  • ‘అమ్మాయే సన్నగా..’కు నీహారిక, సుహాసిని డ్యాన్స్
  •  హుషారుగా డ్యాన్స్.. సోషల్ మీడియాలో వీడియో
  • ఈ నెల 29న విడుదల కానున్న ‘సూర్యకాంతం’  

దాదాపు పదిహేడేళ్ల క్రితం విడుదలైన పవన్ కల్యాణ్ చిత్రం ‘ఖుషి’.. యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని ఆడియో సూపర్ డూపర్ హిట్ అయింది. ముఖ్యంగా, ‘అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా..’ పాట ఎంత పెద్ద హిట్ అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

కట్ చేస్తే.. తన బాబాయ్ పాటకు నీహారిక డ్యాన్స్ చేస్తూ హుషారెత్తించింది. ఈ సరదా సంఘటన ‘సూర్యకాంతం’ సెట్ లో జరిగింది. ఈ పాటకు నీహారికతో పాటు సీనియర్ నటి సుహాసిని కూడా జతకలిసింది. ఈ పాటకు వీళ్లిద్దరూ డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాలకు చేరడం గమనార్హం. కాగా, ‘సూర్యకాంతం’ దర్శకుడు రాహుల్ విజయ్. నిర్వాణా సినిమాస్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు నీహారిక సోదరుడు, ప్రముఖహీరో వరుణ్ తేజ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 29న ‘సూర్యకాంతం’ విడుదల కానుంది.


More Telugu News