Hyderabad: ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్

  • ఓటు హక్కును 472 మంది వినియోగించుకున్నారు 
  • కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభం
  • ‘మా’ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న శివాజీరాజా, నరేష్

కొద్ది సేపటి క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఎన్నికల్లో మొత్తం 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభం కానుంది. కాగా, హైదరాబాదులోని ఫిలిం ఛాంబర్ లో ఈ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలవరకు కొనసాగింది. అసోసియేషన్ అధ్యక్ష పదవికి శివాజీరాజా, నరేష్ లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

More Telugu News