chandragiri: వైసీపీ నేతల నుంచి ఫామ్ 6, 7 స్వాధీనం.. పోలీసులకు అప్పగించిన గ్రామస్తులు

  • చంద్రగిరి నియోజకవర్గం మొరవపల్లెలో ఘటన
  • వైసీపీ నేతలపై గ్రామస్తుల ఆగ్రహం
  • చెవిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మొరవపల్లెలో పలువురు వైసీపీ నేతలను గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే, వైసీపీ నేతల నుంచి ఓటరు లిస్ట్, ఫామ్ 6, 7 పత్రాలను గ్రామస్తులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో, తమ ఓట్లను తొలగించేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరెడ్డి ఎన్నికల్లో గెలిచేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని అన్నారు.

More Telugu News