Maharashtra: మోదీ మాటలు సైనికులను అవమానించేలా ఉన్నాయి: రాజ్‌ ఠాక్రే

  • రాఫెల్‌ యుద్ధవిమానాలు ఉంటే మరోలా ఉండేదనడం దారుణం
  • ఎన్నికల కోసం మరో ఉగ్రదాడి జరుగుతుందేమో
  • ఓట్ల కోసం అబద్ధాలు చెప్పడం సరికాదు

దాయాది దేశంతో సరిహద్దులో ఉద్రిక్తతలు, సర్జికల్స్‌ స్ట్రయిక్స్‌ నేపథ్యంలో మోదీ అసంబద్ధంగా మాట్లాడుతున్నారని, రాఫెల్‌ యుద్ధ విమానాలు ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అనడం సైనికులను అవమానించడమేనని మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన చీఫ్‌ రాజ్‌ ఠాక్రే విమర్శించారు.

ఎన్నికల్లో గెలిచేందుకు అబద్ధాలు చెప్పడం సర్వసాధారణమని, కానీ దానికీ ఓ హద్దు ఉంటుందని రాజ్‌ ఠాక్రే అన్నారు. పుల్వామా ఉగ్రదాడి, తదనంతర పరిణామాల తర్వాత బీజేపీ తీరు చూస్తుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు పుల్వామా లాంటి మరో ఉగ్రదాడి జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజ్‌ అనుమానం వ్యక్తం చేశారు.

More Telugu News