election commission: సైనిక త్యాగాలను ప్రచారానికి వాడుకోకండి: రాజకీయ పార్టీలకు ఈసీ ఆదేశం

  • పోస్టర్లపై సైనికుల ఫొటోలు ఉంచరాదని సూచన
  • పైలట్‌ అభినందన్‌ ఫొటో వినియోగించిన బీజేపీ నేత
  • తన దృష్టికి రావడంతో స్పందించిన ఎన్నికల సంఘం

సైనికుల త్యాగాలను రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా హెచ్చరించింది. ఈ విషయంలో రాజకీయ పార్టీల అధినాయకత్వం తమ కేడర్‌కు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని ఆదేశించింది. ఇటీవల సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు, పాకిస్థాన్‌ సైన్యానికి భారత్‌ వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ చిక్కడం, ఆ తర్వాత ఇరుదేశాల మధ్య చర్చల్లో భాగంగా ఆయన విడుదల కావడం, వాఘా సరిహద్దులో అతన్ని అప్పగించిన సందర్భంగా ఉద్విగ్నపరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలతో అభినందన్‌ ఒక్కసారిగా రియల్‌ హీరోలా మారిపోయారు.

దేశవ్యాప్తంగా అభినందన్‌తో ఉన్న హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటుచేసి అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇదే అదనుగా ఓ బీజేపీ సీనియర్‌ నాయకుడు తయారు చేయించుకున్న హోర్డింగ్‌లో అభినందన్‌ ఫొటో వాడారు. ఈ హోర్డింగ్‌ కాస్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొట్టి వైరల్‌గా మారడంతో ఎన్నికలు సంఘం దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన ఈసీ సైనికుల ఫొటోలు వాడరాదంటూ ఆదేశాలు జారీ చేసింది.

More Telugu News