Charitha Reddy: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన గౌరు చరితా రెడ్డి దంపతులు

  • గుండ్లేరుకు శంకుస్థాపన చేసినందుకు ధన్యవాదాలు
  • చెరువులను నింపేందుకు చర్య తీసుకోవాలి
  • ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తానని హామీ ఇచ్చారు

కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తన భర్త గౌరు వెంకటరెడ్డితో కలిసి నేడు టీడీపీలో చేరారు. అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు కర్నూలు జిల్లాకు చెందిన మరికొందరు వైసీపీ నేతలు కూడా టీడీపీలో చేరారు.

ఈ సందర్భంగా చరితా రెడ్డి మాట్లాడుతూ.. ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లోని చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరినట్టు తెలిపారు. కర్నూలు జిల్లా ప్రజలకు తాగునీటి సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో గుండ్లేరుకు శంకుస్థాపన చేసినందుకు ధన్యవాదాలు తెలిపినట్టు చరిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ జిల్లాను ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తానని చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.

More Telugu News