shalini: మళ్లీ విజయ్ దేవరకొండ జోడీ కడుతోన్న షాలినీ పాండే

  • 'అర్జున్ రెడ్డి'తో షాలినీ పాండేకి క్రేజ్
  • విజయ్ దేవరకొండతో ఆనంద్ అన్నామలై మూవీ
  • స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే కథ      

తెలుగు తెరపై 'అర్జున్ రెడ్డి' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా నాయకా నాయికలుగా విజయ్ దేవరకొండ .. షాలినీ పాండే నటించారు. ఈ సినిమా చూసినవాళ్లు .. జోడీ అదిరింది అంటూ తమ మనసులోని మాట చెప్పారు. అప్పటి నుంచి ఈ జోడీని మళ్లీ తెరపై చూడాలని యూత్ ఆశపడుతోంది. త్వరలోనే వాళ్ల ముచ్చట తీరనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమాను థియేటర్స్ కి తీసుకొచ్చే పనిలో వున్నాడు. ఇక క్రాంతిమాధవ్ సినిమాను కూడా చకచకా కానిచ్చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై తో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో కథానాయికగా షాలిని పాండేను తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఈ ప్రాజెక్టుపై ఒక రేంజ్ లో అంచనాలు పెరగడానికి ఈ కాంబినేషన్ ఒక్కటి సరిపోతుందని చెప్పుకుంటున్నారు.

More Telugu News