south central railway: విజయవాడ, తిరుపతి నుంచి రాకపోకలు జరిపే పలు రైళ్లు రద్దు

  • నంద్యాల రైల్వే యార్డులో అభివృద్ధి పనుల ప్రభావం
  • 18 పాసింజరు, 4 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పూర్తిగా రద్దు
  • ఎనిమిది సర్వీసులపై పాక్షిక ప్రభావం

విజయవాడ, తిరుపతి, కాచిగూడ తదితర స్టేషన్ల నుంచి రాకపోకలు జరిపే పలు పాసింజరు, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల రైల్వే యార్డు వద్ద నిర్వహణ పనులు చేపడుతుండడంతో ఈ రద్దు అనివార్యమైందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 18 పాసింజరు రైళ్లను, 4 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పూర్తిగా, ఎనిమిదింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కారణంగా విజయవాడ-గూడూరు, విజయవాడ-హుబ్బళి, విజయవాడ-బెంగళూరు, విజయవాడ-బిట్రగుంట, బిట్రగుంట-చెన్నై, గూడూరు-తిరుపతి, గూడూరు-రేణిగుంట, గూడూరు-విజయవాడ, తిరుపతి-గుంటూరు, చెన్నై-గూడూరు, తిరుపతి-గూడూరు, రేణిగుంట-గూడూరు, గుంటూరు-కాచిగూడ, గుంటూరు-తిరుపతి, కాచిగూడ-గుంటూరు, హుబ్బళి-విజయవాడ, బెంగళూరు-విజయవాడ ప్యాసింజర్‌ రైళ్లు రద్దు కానున్నాయి.

వీటితోపాటు మచిలీపట్నం-యశ్వంత్‌పూర్‌, యశ్వంత్‌పూర్‌-మచిలీపట్నం, విజయవాడ-ధర్మవరం, ధర్మవరం-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కూడా రద్దయిన జాబితాలో ఉన్నాయి.

More Telugu News