Rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పారితోషికంలో రాజీపడని రకుల్ 
  • సీక్వెల్ కి రెడీ అవుతున్న నిఖిల్ 
  • మరోసారి పాట పాడిన విక్రం

*  తెలుగులో సినిమాలు లేకపోయినా కూడా పారితోషికం విషయంలో మాత్రం కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ రాజీ పడడం లేదు. నాగార్జున నటించే 'మన్మథుడు 2' చిత్రంలో కథానాయికగా నటించడానికి గాను ఈ ముద్దుగుమ్మ కోటి యాభై లక్షలు తీసుకుంటోందట.
*  నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఆమధ్య వచ్చిన 'కార్తికేయ' చిత్రం విజయాన్ని సాధించింది. దీంతో ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికి స్క్రిప్ట్ సిద్ధమైందని, నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
*  గతంలో రెండు మూడు సినిమాలలో పాటలు పాడిన తమిళ హీరో విక్రం తాజాగా మరోసారి గొంతు సవరించాడు. తాను హీరోగా నటిస్తున్న 'కాదరన్ కొండన్' చిత్రం కోసం గిబ్రాన్ సంగీత సారథ్యంలో విక్రం ఈ పాట పాడాడట. 

More Telugu News