Telangana: తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఐటీ గ్రిడ్స్ ఎండీ

  • డేటా చోరీ కేసు వ్యవహారంలో ఆసక్తికర పరిణామం
  • క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అశోక్
  • ఈ కేసు కొట్టేయమని వినతి

డేటా చోరీ కేసు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ ఎండీ అశోక్ ను అదుపులోకి తీసుకునేందుకు తెలంగాణ సిట్ అధికారులు యత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును కొట్టి వేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును అశోక్ ఆశ్రయించారు. ఈ మేరకు క్వాష్ పిటిషన్ ను అశోక్ తరపు న్యాయవాదులు సమర్పించారు. డేటా దుర్వినియోగం కేసును కొట్టివేయాలని ఆ పిటిషన్ లో అశోక్ కోరినట్టు సమాచారం.

More Telugu News