mizoram: మిజోరాం గవర్నర్ రాజీనామా

  • గవర్నర్ పదవికి రాజీనామా చేసిన రాజశేఖరన్
  • ఆమోదించిన రాష్ట్రపతి కోవింద్
  • తాత్కాలిక గవర్నర్ గా అసోం గవర్నర్ కు బాధ్యతల అప్పగింత

మిజోరాం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడింది. మరోవైపు, అసోం గవర్నర్ జగదీష్ ముఖిని మిజోరాం తాత్కాలిక గవర్నర్ గా నియమించారు. మిజోరాంకు కొత్త గవర్నర్ ను నియమించేంత వరకు జగదీష్ ఈ రాష్ట్ర కార్యకలాపాలను కూడా పర్యవేక్షించనున్నారు. ఆర్ఎస్ఎస్ కు ఎంతో కాలం సేవలందించిన రాజశేఖరన్ ను 2018 మే 25న మిజోరాం గవర్నర్ గా నియమించారు. రాజీనామాకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

More Telugu News