BJP: ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు

  • ఎన్నికల సమయంలో ఆయనను మార్చాలని విజ్ఞప్తి
  • రాష్ట్రంలో అధికారులు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణ
  • ఓట్ల తొలగింపు అంశంపైనా ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌లోని పలువురు ఉన్నత స్థాయి అధికారులు అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, అటువంటి వారిని మార్చాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఈరోజు ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా రాష్ట్ర పోలీస్‌ బాస్‌ డీజీపీ ఠాకూర్‌ను తక్షణం మార్చాలని కోరినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. కన్నా ఆధ్వర్యంలో పలువురు పార్టీ నేతలు ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి తమ ఫిర్యాదు అందించారు. రాష్ట్రంలో  విపక్షాలకు చెందిన లక్షలాది మంది ఓట్లను తొలగించారని, తొలగించిన ఓట్లన్నింటినీ తిరిగి చేర్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

More Telugu News