Congress: ప్రియాంక పేరు లేకుండా లోక్ సభ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

  • యూపీలో 11, గుజరాత్ లో 4 స్థానాలకు అభ్యర్థుల ఖరారు
  • రాయ్ బరేలీ నుంచి సోనియా, అమేథీ నుంచి రాహుల్
  • తొలిజాబితాలో తల్లీకొడుకుల పేర్లు 

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు దూకుడు మీదున్నాయి. ముఖ్యంగా, యువనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో వేగం ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో గురువారం లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. 15 మందితో కూడిన ఈ జాబితాలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోపాటు మాజీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఉన్నారు. అయితే ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేరులేదు. ఇక, రాహుల్ గాంధీ, సోనియా తమకు అచ్చొచ్చిన అమేథీ, రాయ్ బరేలీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ఈ తొలి జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి 11 మంది, గుజరాత్ నుంచి నలుగురు చోటు దక్కించుకున్నారు.

More Telugu News