Andhra Pradesh: ఇదో మాయ.. ‘భీమిలి’లో 36 ఓట్లు తొలగించాలని చనిపోయి వ్యక్తి దరఖాస్తు!

  • నియోజకవర్గంలో 3,578 ఓట్ల రద్దుకు వినతి
  • దోషులపై చర్యలు తీసుకుంటామన్న అధికారులు
  • విమర్శలు గుప్పించుకుంటున్న అధికార, విపక్షాలు

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఫామ్-7 రగడ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తమ ఓట్లను తొలగిస్తున్నారని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీలు పరస్పరం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం జిల్లాలోని భీమిలి నియోజకవర్గంలో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

భీమిలి నియోజకవర్గంలో మొత్తం 3,578 ఓట్లను తొలగించాలని ఆన్ లైన్ లో దరఖాస్తు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 36 మంది ఓట్లను తొలగించాలని ఓ చనిపోయిన వ్యక్తి పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు దరఖాస్తు చేశారన్నారు. ఈ విషయంలో దర్యాప్తు జరుపుతున్నామనీ, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

More Telugu News