saidharam tej: ఆశ్చర్యపరుస్తోన్న 'చిత్రలహరి' ప్రీ రిలీజ్ బిజినెస్

  • కిషోర్ తిరుమల నుంచి 'చిత్రలహరి'
  • ముగింపు దశకి చేరుకున్న షూటింగ్ 
  • ఏప్రిల్లో భారీస్థాయి విడుదల    

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ .. కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా చేస్తున్నాడు. ఈ ప్రేమకథా చిత్రంలో కథానాయికలుగా కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఆరంభించారు.

ఇంతకుముందు సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా చేసిన 6 సినిమాలు పరాజయంపాలు కావడం వలన, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్ల లోపే జరగవచ్చని చాలామంది అనుకున్నారు. కానీ వాళ్ల అంచనాలను తలక్రిందులు చేస్తూ, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవర్సీస్ హక్కుల ధర తెలియాల్సి వుంది. దర్శకుడిగా కిషోర్ తిరుమలపై గల నమ్మకంతో ఈ సినిమా ఈ స్థాయి బిజినెస్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా అయినా సాయిధరమ్ తేజ్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి. 

More Telugu News