keerthi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో కీర్తి 
  • నిర్మాతగా స్పీడు పెంచుతున్న సందీప్ 
  • దర్శకుడు శివకు సూర్య గ్రీన్ సిగ్నల్ 
  • సమంత సినిమాకు 'జాను' టైటిల్  

*  బాలీవుడ్ దర్శకుడు నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ నాయికగా ఓ చిత్రం రూపొందనుంది. కథానాయిక ప్రధాన చిత్రంగా రూపొందే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. దీనికి సంగీత దర్శకుడిగా తాజాగా దేవిశ్రీ ప్రసాద్ ను ఎంచుకున్నారు.
*  యంగ్ హీరో సందీప్ కిషన్ నిర్మాతగా మారి వెంకటాద్రి మూవీస్ బ్యానర్ పై ప్రస్తుతం 'నిను వీడని నీడను నేనే' చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ముందు ముందు తన బ్యానర్ పై ఇతర హీరోలతో కూడా చిత్రాలు నిర్మించే ఆలోచన వుందని, అందుకు ప్లాన్ జరుగుతోందని సందీప్ చెప్పాడు.
*  తాజాగా అజిత్ హీరోగా 'విశ్వాసం' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శివ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈసారి సూర్యతో కలసి మరో భారీ చిత్రాన్ని రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడు. కథ నచ్చడంతో సూర్య ఈ ప్రాజక్టుకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
*  తమిళంలో హిట్టయిన '96' చిత్రాన్ని దిల్ రాజు తెలుగులోకి రీమేక్ చేస్తున్న విషయం విదితమే. శర్వానంద్, సమంత జంటగా నటించే ఈ చిత్రానికి 'జాను' అనే టైటిల్ని నిర్ణయించినట్టు సమాచారం.

More Telugu News