jyothi: 'బిగ్ బాస్'లో ఎన్టీఆర్ అంటే మేమంతా భయపడిపోయేవాళ్లం: నటి జ్యోతి

  • 'బిగ్ బాస్'లో ఉండగా చాలా టెన్షన్ ఉండేది
  • సీజన్ 2లో ఎవరిలోను భయం కనిపించలేదు
  • హైదరాబాద్ లో నిర్వహించడం మరో కారణం    

'బిగ్ బాస్' రియాలిటీ షోలో నటి జ్యోతి పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత 'బిగ్ బాస్ 2'కి నాని హోస్ట్ గా వ్యవహరించగా, త్వరలో 'బిగ్ బాస్ 3'ను ఆరంభించడానికి నిర్వాహకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో జ్యోతి మాట్లాడుతూ .. 'బిగ్ బాస్'లో పాల్గొన్నప్పుడు ఎన్టీఆర్ అంటే మా అందరికీ చాలా భయంగా ఉండేది. ఆయన వస్తున్నాడంటేనే అందరికీ వణుకుగా ఉండేది. ఎవరి గురించి ఏం మాట్లాడతాడోననే టెన్షన్ ఉండేది. ఆ షోను ఆయన ఎంతో సమర్థవంతంగా నడిపించాడు.

'బిగ్ బాస్ 2' విషయానికి వస్తే హౌస్ లో వుండే ఎవరికీ ఎలాంటి భయం లేకుండా పోవడం గమనించాను. ఎప్పుడు చూసినా అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అది చూసి .. 'బిగ్ బాస్ 2'లో నాకు అవకాశం వచ్చి వుంటే బాగుండేదే అనిపించింది. ఈ షోను హైదరాబాద్ లోనే నిర్వహించడం వలన కూడా వాళ్లలో భయం .. టెన్షన్ లేకపోవడానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

More Telugu News