nithin: తదుపరి ప్రాజెక్టుల గురించి త్వరలోనే చెబుతాను: హీరో నితిన్

  • వరుస పరాజయాలు 
  • వెంకీ కుడుములతో 'భీష్మ'
  • ఈ ఏడాది రెండు సినిమాలుంటాయి  

'అ ఆ' సినిమా తరువాత నితిన్ కి ఇంతవరకూ హిట్ పడలేదు. 'శ్రీనివాస కల్యాణం'పై ఆయన పెట్టుకున్న ఆశలు .. నిరాశనే మిగిల్చాయి. వెంకీ కుడుముల దర్శకత్వంలో 'భీష్మ' సినిమా చేయనున్నట్టుగా ఆయన చెప్పి చాలా కాలమే అయింది. ఆ ప్రాజెక్టు ఇంతవరకూ పట్టాలెక్కలేదు. దాంతో నితిన్ తదుపరి సినిమాల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందనే విషయంలో అభిమానులు అయోమయానికి లోనవుతున్నారు.

ఈ నేపథ్యంలో నితిన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .." నా నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఈ నెల చివరిలో చెబుతాను. పక్కా ప్రామిస్ చేసి చెబుతున్నాను .. త్వరలోనే వాటి షూటింగ్స్ మొదలుకాబోతున్నాయి. ప్రస్తుతం అవి స్క్రిప్ట్ దశలో వున్నాయి. ఈ ఏడాది నా సినిమాలు రెండు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాను. ఈ విషయంలో ఆలస్యమైనా ఓపికతో వున్న నా అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News