ajay devgan: స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే అజయ్ దేవగణ్ మూవీ .. హీరోయిన్ గా కీర్తి సురేశ్

  • ఫుట్ బాల్ కోచ్ 'సయ్యద్ అబ్దుల్ రహీమ్' బయోపిక్ 
  • దర్శకుడిగా అమిత్ శర్మ.. నిర్మాతగా బోనీ కపూర్ 
  • జూన్ నుంచి షూటింగ్ మొదలు 

ప్రస్తుతం కీర్తి సురేశ్ తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. తెలుగు నుంచి తనకి నచ్చే కథ కోసం వెయిట్ చేస్తోంది. ఇక హిందీపై కూడా ఒక లుక్ వేసిందనే విషయం ఇటీవలే ప్రచారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే హిందీలో అజయ్ దేవగణ్ సినిమాలో ఆమె హీరోయిన్ గా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

'బధాయి హో' దర్శకుడు అమిత్ శర్మ .. బోని కపూర్ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్త నిజమేననేది తాజా సమాచారం. ఫుట్ బాల్ కోచ్ 'సయ్యద్ అబ్దుల్ రహీమ్' జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మితమవుతుందట. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలోనే కథానాయికగా కీర్తి సురేశ్ కనిపించనుంది. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తొలి సినిమాతోనే బాలీవుడ్లో మంచి పేరు రావడం ఖాయమనే బలమైన నమ్మకంతో కీర్తి సురేశ్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

More Telugu News