Pawan Kalyan: పవన్‌తో టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట భేటీ!

  • ఒంగోలులో భేటీ అయిన శ్రీనివాసులరెడ్డి
  • ఎంపీ లేదంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం
  • రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్న భేటీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిల భేటీ కలకలం రేపుతోంది. నేడు ఒంగోలులోని బృందావన్ గార్డెన్‌లో పవన్‌ను శ్రీనివాసులరెడ్డి కలిశారు. ఈ కలయిక రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీనివాసుల రెడ్డి జనసేనలో చేరతారని.. ఆ పార్టీ తరుపున ఎంపీ లేదంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఇప్పటికే జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన వెళ్లి పవన్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే చిరంజీవి కుటుంబంతో శ్రీనివాసులరెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయని.. ఈ కారణంగానే ఆయన పవన్‌ను కలిశారని.. అనుచరులు చెబుతున్నారు.

More Telugu News