telangana: ఐటీ గ్రిడ్ ఉద్యోగుల అదృశ్యం కేసులో పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

  • ఐటీ గ్రిడ్ ఉద్యోగులు కనిపించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్
  • ప్రతివాదులుగా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ
  • రేపు 10.30కు నలుగురినీ ప్రవేశపెట్టాలంటూ హైకోర్టు ఆదేశం

హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న ఐటీ గ్రిడ్ కంపెనీలో పని చేస్తున్న నలుగురు ఉద్యోగులు కనిపించడం లేదని హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను సహ ఉద్యోగి అశోక్ దాఖలు చేశారు. తమ ఉద్యోగులు ఫణి కడలూరి, రేగొండ భాస్కర్, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ లు కనిపించడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ లో తెలంగాణ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీతో పాటు సైబర్ క్రైమ్ వింగ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, మాదాపూర్ సీఐలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సోమవారం 10.30 గంటలకు నలుగురినీ తమ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. ఆ నలుగురికి తాము సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. అయితే, కేసు డైరీలో బ్లాంక్ పేపర్లు ఉండటంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ప్రాణాలను రిస్క్ లో పెట్టుకుని ఏ కుటుంబసభ్యులు పోలీసులపై ఫిర్యాదు చేయరని మండిపడింది.

More Telugu News