jagan: చినజీయర్ స్వామికి పాదాభివందనం చేసిన జగన్

  • ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న అనంతరం ఢిల్లీ చేరుకున్న జగన్
  • శంషాబాద్ విమానాశ్రయం నుంచి చినజీయర్ ఆశ్రమానికి పయనం
  • జగన్ వెంట విజయసాయి, మిథున్ రెడ్డి

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి చినజీయర్ స్వామిని వైసీపీ అధినేత జగన్ కలిశారు. ఢిల్లీలో ఇండియా టుడే సదస్సుల్లో పాల్గొన్న అనంతరం ఈ మధ్యాహ్నం హైదరాబాదుకు జగన్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా చినజీయర్ ఆశ్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా జీయర్ పాదాలకు జగన్ నమస్కరించి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. పాదయాత్రకు ముందు కూడా జీయర్ ను కలిసి జగన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు కూడా జగన్ వెంట ఉన్నారు.

More Telugu News