pakistan: పాకిస్థాన్, చైనాల మధ్య విమాన సర్వీసులు రద్దు

  • భారత్, పాకిస్థానల్ మధ్య ఉద్రిక్తతలు
  • తన గగనతలాన్ని మూసివేసిన పాక్
  • విమాన రాకపోకలను రద్దు చేసిన చైనా

భారత్- పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ కు వెళ్లాల్సిన విమానాలను చైనా రద్దు చేసింది. పాకిస్థాన్ నుంచి వచ్చే విమానాలను కూడా నిలిపివేయనున్నట్టు తెలిపింది. పాకిస్థాన్ తన గగనతలాన్ని మూసివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైనా అధికారులు తెలిపారు. మరోవైపు, పాకిస్థాన్ నిర్ణయంతో ప్రభావితమైన అంతర్జాతీయ ఎయిర్ లైన్లు తమ గగనతలాన్ని వినియోగించుకోవడానికి చైనా అనుమతించింది. ఇదే సమయంలో ఉద్రిక్త పరిస్థితులకు స్వస్తి పలకాలని ఇండియా, పాకిస్థాన్ లకు చైనా సూచించింది. 

More Telugu News