aadi: త్రివిక్రమ్ చేతుల మీదుగా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' ఫస్టులుక్

  • సాయికిరణ్ అడివి నుంచి 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'
  • కథానాయకుడిగా ఆది సాయికుమార్
  •  ప్రత్యేక పాత్రలో అబ్బూరి రవి

'వినాయకుడు'.. 'కేరింత' వంటి చిత్రాలతో దర్శకుడిగా సాయికిరణ్ అడివి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' రూపొందుతోంది. ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఇద్దరు కథానాయికలు కనిపించనున్నారు. కార్తీక్ రాజు .. నూకరాజు .. కృష్ణుడు .. అబ్బూరి రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

సినీ రచయితగా మంచి పేరున్న అబ్బూరి రవి, ఈ సినిమాలో 'ఘాజీబాబా'పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఆయన పాత్రకి సంబంధించిన ఫస్టులుక్ ను త్రివిక్రమ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. అబ్బూరి రవి లుక్ ఆకట్టుకునేలా .. సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా వుంది. శ్రీచరణ్ పాకల సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో వున్నారు.

More Telugu News