Andhra Pradesh: ప్రత్తిపాడు వద్ద ఢీకొన్న రెండు ప్రైవేటు బస్సులు.. ముగ్గురికి తీవ్రగాయాలు!

  • తూర్పుగోదావరి జిల్లాలోని ప్రత్తిపాడులో ఘటన
  • ఎదురెదురుగా వస్తూ ఢీకొన్న బస్సులు
  • క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వస్తున్న ఓ ప్రైవేటు బస్సు ఎదురుగా వస్తున్న మరో ప్రైవేటు బస్సును ప్రత్తిపాడు వద్ద ఢీకొట్టింది. ఈ ఘటన రెండు వాహనాల్లోని ముగ్గురు తీవ్రంగా గాయపడగా, పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ విషయమై వైద్యులు స్పందిస్తూ క్షతగాత్రుల ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని తెలిపారు. వారి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదన్నారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News