YSRCP: పింఛన్‌దారులకు అందించేందుకు స్వీట్ బాక్సులను సిద్ధం చేసిన వైసీపీ.. సీజ్ చేసిన అధికారులు

  • మచిలీపట్నంలోని ఓ హోటల్‌లో తనిఖీ
  • 150 స్వీట్ ప్యాకెట్లతో కూడిన 27 కార్టన్ల సీజ్
  • బాధ్యులపై కేసు నమోదు చేస్తామన్న సంపత్

మార్చి 1 నుంచి సామాజిక పింఛన్ల పంపిణీ సందర్భంగా పింఛన్ దారులకు ఇచ్చేందుకు తమ పార్టీ గుర్తులతో కూడిన స్వీట్ ప్యాకెట్లను వైసీపీ సిద్ధం చేసింది. అయితే ఈ సమాచారం అందుకున్న అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా స్వీట్ బాక్సుల పంపిణీ నిబంధనలకు విరుద్ధమని వాటిని స్వాధీనం చేసుకున్నారు. మచిలీపట్నంలోని ఓ హోటల్‌లో తనిఖీ చేసిన అధికారులు 150 స్వీట్ ప్యాకెట్లతో కూడిన 27 కార్టన్లతోపాటు మరికొన్ని ఖాళీ బాక్సులను అధికారులు సీజ్ చేశారు. ఈ విషయమై కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్‌స్పెక్టర్ సంపత్ కుమార్ బాధ్యులపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.

More Telugu News