nagarjuna: 'మన్మథుడు 2'లో కీలకమైన పాత్రలో సమంత

  • నాగ్ నుంచి 'మన్మథుడు 2'
  • నాయికగా రకుల్ ప్రీత్ సింగ్
  •  మార్చి 12 నుంచి రెగ్యులర్ షూటింగ్  

నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో 'మన్మథుడు' ఒకటిగా కనిపిస్తుంది. ఈ సినిమా నాగార్జున క్రేజ్ ను మరింతగా పెంచేసింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా 'మన్మథుడు 2' రూపొందుతోంది. అన్నపూర్ణ బ్యానర్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. మార్చి 12వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

ఈ సినిమాకి సంబంధించిన మేజర్ పార్టు షూటింగ్ యూరప్ లో జరగనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ఎంపిక జరిగిపోయింది. ఆ తరువాత ఒక కీలకమైన పాత్రను అనుష్క చేయనుందనే వార్త వినిపించింది. తాజాగా సమంత పేరు తెరపైకి వచ్చింది. అనుష్క బదులుగా సమంతను తీసుకోనున్నారా? లేదంటే సమంత పోషించేది వేరే పాత్రనా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.

More Telugu News