nayanatara: రజనీ సరసన ఇద్దరు కథానాయికలు ఖరారు

  • రజనీతో మురుగదాస్ మూవీ
  • తొలిసారిగా రజనీ జోడీగా కీర్తిసురేశ్
  •  రజనీ సరసన రెండోసారి నయన్  

రజనీకాంత్ కథానాయకుడిగా మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే దిశగా చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ముందుగా కీర్తి సురేశ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత తెరపైకి నయనతార పేరు వచ్చింది. దాంతో ఇద్దరినీ తీసుకుంటారా? లేదంటే ఎవరో ఒకరిని మాత్రమే ఎంపిక చేసుకుంటారా? అనే సందేహం అభిమానుల్లో తలెత్తింది. ఈ నేపథ్యంలో రజనీ సరసన కథానాయికలుగా ఈ ఇద్దరినీ ఖరారు చేసుకున్నారనేది తాజా సమాచారం. రజనీతో జోడీ కట్టడమనేది కీర్తి సురేశ్ కి ఇదే మొదటిసారి. ఇక 'చంద్రముఖి' తరువాత రజనీ సరసన నాయికగా నయనతార రెండోసారి కనిపించనుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

More Telugu News