Indian Airforce: గుంజన్ సక్సేనా బయోపిక్‌లో జాన్వీ కపూర్

  • శరణ్ శర్మ దర్శకత్వం
  • ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
  • ‘కార్గిల్ గాళ్’ అనే టైటిల్ ఫిక్స్

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ జెట్‌కు పైలెట్‌గా బాధ్యతలు నిర్వహించిన గుంజన్ సక్సేనా జీవితాధారంగా సినిమా తెరకెక్కుతోంది. ఆమె 1999లో కార్గిల్ యుద్ధంలోనూ పాల్గొన్నారు. ఈ బయోపిక్‌లో లెజెండరీ నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో ‘కార్గిల్ గాళ్’గా జాన్వీ కనిపించనుంది. శరణ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘కార్గిల్ గాళ్’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. గుంజన్ సక్సేనా జీవితం గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

More Telugu News