India: శంషాబాద్ నుంచి చండీగఢ్ వెళ్లే విమానాలు తాత్కాలికంగా రద్దు!

  • భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ఎఫెక్ట్
  • చండీగఢ్, గుర్ గ్రావ్, డెహ్రాడూన్, అమృత్ సర్ కు  వెళ్లే విమానాల రద్దు
  • ప్రయాణికులకు ముందస్తు సమాచారం పంపిన అధికారులు

భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పలు విమానాలను తాత్కాలికంగా రద్దు చేశారు. పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా రాష్ట్రాలకు వెళ్లే విమానాలను రద్దు చేసినట్టు సంబంధిత అధికారుల సమాచారం. హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి చండీగఢ్, గుర్ గ్రావ్, డెహ్రాడూన్, అమృత్ సర్ కు  వెళ్లే విమానాలను తాత్కాలికంగా రద్దు చేసినట్టు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఈ విషయమై ప్రయాణికులకు ముందస్తు సమాచారం పంపినట్టు చెప్పారు.

కాగా, పాకిస్థాన్ లోని పలు నగరాల విమానాశ్రయాల్లో ఆంక్షలు విధించారు. ఇస్లామాబాద్, లాహోర్ నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. సియాల్ కోట్, ఫైసలాబాద్, ముల్తాన్ విమానాశ్రయాలకు రాకపోకలు నిలిపివేశారు.

More Telugu News